కరీంనగర్ అభివృద్ధికి మీరేం చేశారో చెప్పండి?: ఎంపీ అభ్యర్థి

by Disha Web Desk 18 |
కరీంనగర్ అభివృద్ధికి మీరేం చేశారో చెప్పండి?: ఎంపీ అభ్యర్థి
X

దిశ,వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లిలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిందేమి లేదనీ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ ఆరోపించారు. బోయినపల్లి లో ఆదివారం ఆయన మాట్లాడుతూ 2014-2019 లో ఆయన తాను ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వే లైన్ తెచ్చినట్లు పేర్కొన్నారు. వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చానన్నారు. బండి సంజయ్ కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed